సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు | Weather hampers efforts in Nepal | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు

Jul 4 2018 9:44 AM | Updated on Mar 21 2024 5:20 PM

మానస సరోవర యాత్రలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు అనే తెలుగు యాత్రికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెల్సిందే. ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్‌కు నేపాల్‌ అధికారులు తరలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం లక్నో మీదుగా కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తర్వగా తరలించేందుకు నేపాల్‌ రాయబార కార్యాలయంతో ఏపీభవన్‌ అధికారులు సంప్రదింపులు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement