నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ సభ్యడు, సీనియర్ నేత డి.శ్రీనివాస్పై జిల్లా నేతతు తిరుగుబాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్లో ఎంపీ కవిత నివాసంలో బుధవారం పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు.