పోలీసు బూట్లను ముద్దాడిన మాధవ్‌ | Gorantla Madhav Counter To JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

పోలీసు బూట్లను ముద్దాడిన మాధవ్‌

Dec 20 2019 11:18 AM | Updated on Mar 20 2024 5:40 PM

పోలీసులపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను ముద్దాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డికి హితవు పలికారు. ప్రజల ధన మాన ప్రాణాలను.. దేశ సమగ్రతను, సారభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో అమరవీరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నానని ఎంపీ మాధవ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement