‘ఆ విషయం పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాలి’ | Dwarampudi Chandrasekhar Reddy Slams Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘ఆ విషయం పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాలి’

Jan 14 2020 7:21 PM | Updated on Jan 14 2020 7:33 PM

జనసేన పార్టీ కార్యకర్తలు కావాలనే ఒక ప్లాన్‌ ప్రకారం తన ఇంటిపై దాడి చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తన ఇంటికి ధ్వంసం చేసేందుకు యత్నించారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ కలిసి రాష్ట్రంలో అశాంతి కలిగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే.. రాజధాని సాకుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నింస్తున్నారని విమర్శించారు. జనసేన నాయకుడు నానాజీ రెచ్చగొట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు తన నివాసంపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement