ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Meet Telangana CM KCR | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

Jan 13 2020 2:46 PM | Updated on Mar 22 2024 10:50 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేస్తారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్‌ జగన్, కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement