భారత్ స్పిన్ వేట మళ్లీ మొదలైంది... ఒక వైపు అశ్విన్, మరోవైపు జడేజా చెలరేగుతుంటే... ఇటు పరుగులూ తీయలేక, అటు వరుసగా వికెట్లు కోల్పోతూ న్యూజిలాండ్ దాదాపుగా ‘సమర్పయామి’ అనేసింది. చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేని అసాధ్యమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు నాలుగో రోజు ముగిసేసరికి తలవంచగా... చరిత్రాత్మక 500వ టెస్టులో విజయానికి భారత్ మరో 6 వికెట్ల దూరంలో నిలిచింది. వర్షసూచన కూడా లేకపోవడంతో చివరి రోజు కోహ్లి సేన గెలుపు లాంఛనమే.