వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్గా తులశమ్మ ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా టీడీపీకి చెందిన ముల్లా జానీ ఎన్నికయ్యారు. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను ఉన్నతాధికారులు లాటరీ ద్వారా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఛైర్మన్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరించింది. వైస్ ఛైర్మన్ పీఠాన్ని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది.
Jul 13 2014 1:19 PM | Updated on Mar 21 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement