పరిటాల రవి దెబ్బకు జేసీ బ్రదర్స్ పరారయ్యారు | Sakshi
Sakshi News home page

పరిటాల రవి దెబ్బకు జేసీ బ్రదర్స్ పరారయ్యారు

Published Sun, Mar 5 2017 4:17 PM

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఉండేందుకు జేసీ బ్రదర్స్ గతంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.