చంద్రబాబు సర్కారుకు పవన్‌ హెచ్చరిక | Pawan Kalyan meets chronic kidney patients in Ichapuram | Sakshi
Sakshi News home page

Jan 3 2017 12:10 PM | Updated on Mar 22 2024 11:31 AM

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సహా 11 మండల్లాల్లో కిడ్నీ వ్యాధి సమస్యను ఘోర విపత్తుగా పేర్కొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, కనీసం కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేయలేకపోవడం గర్హనీయమని విమర్శించారు. జనసేన ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌.. కిడ్నీ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement