తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రభుత్వంలో చేరాలనే ఆసక్తి తమకు లేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో ఓవైసీ సోదరులు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం ఓవైసీ సోదరులు మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నగర అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. రూ. వెయ్యి కోట్లతో భాగ్యనగరం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు కేసీఆర్కు అందజేసినట్లు చెప్పారు. తాము ఆశించిన స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అభివృద్ధి జరగడం లేదని ఓవైసీ ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో చార్మినార్ చిహ్నంగా ఉంచాలని కేసీఆర్ను కోరినట్లు ఓవైసీ సోదరులు వెల్లడించారు.
May 22 2014 2:29 PM | Updated on Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement