ఉడీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బలంగా జవాబు ఇవ్వాలన్న ఒత్తిడి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద స్థావరాలపై ముందస్తు దాడి చేయడానికి వారం రోజుల కిందటే ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. బుధవారం నాడు.. రక్షణమంత్రి మనోహర్ పారికర్తో పాటు, ఆర్మీ చీఫ్ దల్బీర్సింగ్ సుహాగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్దోవల్లు రాత్రి ఓ విందుకు హాజరుకావాల్సి ఉంది. కానీ వారెవరూ ఆ విందుకు హాజరుకాలేదు. వారు ముగ్గురూ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్సింగ్తో కలిసి సౌత్ బ్లాక్లోని సైనిక వార్ రూమ్లో రోజంతా చర్చించారు. రహస్య సైనిక చర్యకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ఆమోదం తెలిపాక.. అర్థరాత్రి సైనిక చర్య మొదలయింది.
Sep 30 2016 6:35 AM | Updated on Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement