భవితకు ఆదరువు | - | Sakshi
Sakshi News home page

భవితకు ఆదరువు

Jun 24 2025 3:47 AM | Updated on Jun 24 2025 3:47 AM

భవితక

భవితకు ఆదరువు

ఓపెన్‌ స్కూల్‌ చదువు..

ఓపెన్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

దరఖాస్తుకు జులై 31 వరకు గడువు

14 ఏళ్లు నిండిన వారు పదికి,15 ఏళ్లు నిండిన వారు ఇంటర్‌కు అర్హులు

ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అపరాధ రుసుం లేకుండా జులై 30 తేదీలోగా ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ పొందవచ్చు. పదవ తరగతికి సంబంధించి జనరల్‌ పురుషులకు రిజిస్ట్రేషన్‌, అడ్మిషన్‌ ఫీజు కలిపి రూ. 1550, అన్ని వర్గాల స్ట్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌సీ పురుషులకు రిజిస్ట్రేషన్‌, అడ్మిఫన్‌ పీజు రూ. 1150 చెల్లించాల్సి ఉంది. అలాగే ఇంటర్‌కు సంబంధించి జనరల్‌, పురుషులకు రూ. 1800, అన్ని వర్గాల మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మైనార్టీలకు రూ. 1500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కడప ఎడ్యుకేషన్‌: చదువు మధ్యలో ఆగిందనో.. వయసై పోయిందనో దిగులు చెందాల్సిన అవసరం లేదు.. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు... చదువు కోవాలనే తపన ఉండాలేకానీ చదువు కోవడానికి.. సర్టిఫికెట్లు పొందడానికి వయసు అడ్డంకి కానేకాదిప్పుడు. వివిధ కారణాలలో విద్యకు దూరమైన వారు తిరిగి తమ చదువు కొనసాగించేందుకు విద్యాశాఖ దూర విద్యా విధానంలో సార్వత్రిక విద్యాపీఠం(ఏపీ ఓపెన్‌ స్కూల్‌) ద్వారా పది, ఇంటర్‌ విద్యను కొనసాగించే అవకాశం కల్పించింది.

ఉన్నత విద్యకు సోపానం

ఉద్యోగాల పదోన్నతులకు, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఈ పథకం 1991లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అప్పట్లో దీనికి పెద్దగా ఆదరువు లేకపోయినా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకానికి మహర్దశ పట్టింది. దూర విద్య ద్వారా పదవ తరగతి అనే పథకం తిరికి అమలు లోకి తీసుకోచ్చారు. దీంతోపాటు తిరిగి 2010–11లో ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టారు. ఈ సొసెటీ ద్వారా పొందే ఇంటర్‌, పదవ తరగతి సర్టిఫికెట్లు రెగ్యులర్‌ స్కూల్‌, కళాశాలల్లో పొందే సర్టిఫికెట్లతో సమానం అని ప్రభుత్వ ప్రకటించింది. దీంతో మరింత ఆదరణ లభించింది.

జిల్లాలో స్టడీ సెంటర్ల వివరాలు ఇలా ...

జిల్లావ్యాప్తంగా పదవ తరగతికి 70 స్టడీ సెంటర్లు, ఇంటర్మీటియట్‌కు సంబంధించి 70 ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఈ విధానంలో విద్యా విషయక సబ్జెక్టులతోపాటు వృత్తి విద్యా సంబంధించి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూల్‌ ధ్రువపత్రం ద్వారా ఉన్నత చదువులు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించవచ్చు. ఇంటర్‌కు సంబంధించి సైన్సు గ్రూపులతోపాటు ఆర్ట్స్‌ గ్రూపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసేందుకు వయో పరిమితి లేదు.

అర్హతలు ఇవే...

పదిలో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి, గరిష్ట వయో పరిమితి ఉండదు. చదవడం, రాయడం తెలిసి ఉండాలి. దరఖాస్తుతోపాటు టీసీ, రికార్డు సీటు, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే ఇంటర్మీడియట్‌లో చేరే వారికి ఆగస్టు 31వ తేదీ నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇంటర్‌కు 10వ తరగతి మార్కుల జాబితా, పదవ తరగతి టీసీని దరఖాస్తుతోపాటు అందజేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, విద్యాంగ అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాన్ని అందచేయాల్సి ఉంటుంది. ఇతర సమాచార కోసం www. apopenschool.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

సెలవుల్లో తరగతుల నిర్వహణ...

ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ అడ్మిషన్‌ పొందిన వారికి సాధారణ విద్యకు భిన్నంగా సార్వత్రిక తరగతులను నిర్వహిస్తారు. ఓపెన్‌ స్కూల్‌ చదువు సంబంధించిన క్లాసులను సెలవు రోజుల్లో నిర్వహిస్తారు. ఎంపిక చేసిన స్టడీ సెంటర్లలో జరిగే తరగతులకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్‌ సైన్సు గ్రూపునకు సంబంధించి ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రాక్టికల్‌ పరీక్షల క్లాసులకు హాజరుకావాలి. ప్రతి అభ్యాసకుడు కనీసం 30 తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.

ప్రవేశ వివరాలు తేదీ

ప్రవేశాలు ఇలా...

అడ్మిషన్లు ప్రారంభం తేదీ 12–06–2025

ఆన్‌లైన్‌ చేయడానికి చివరితేదీ 30–07–2025

ఫీజు చెల్లించడానికి చివరితేదీ 31–07–2025

అడ్మిషన్ల వివరాలు...

2023–23 విద్యా సంవత్సరం: 6885

2024–25 విద్యా సంవత్సరం: 7694

నోటిఫికేషన్‌ వెలువడింది

ఈ ఏడాదికి సార్వత్రిక విద్యా ప్రవేశాలకు సంబంధించి నోటిపికేషన్‌ వెలువడింది. గ్రామీణ బాలికలు, మహిళలకు, యువత,గృ హిణులు, ఉద్యోగులు సైతం సద్వినియోగం చేసుకోవచ్చు. మహిళలకు రాయితీ ఉంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులకు ఫీజుల్లో కూడా రాయితీ ఉంది.

–సాంబశివారెడ్డి, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌

సద్వినియోగం చేసుకోండి

వివిధ కారణాలతో చదువలేక పోయినవారికి, చదువు మద్యలో నిలిపివేసిన వారికి సార్వత్రిక విద్య ఓ వరం లాంటింది. పది, ఇంటర్‌ పూర్తిచేయడానికి ఈ ఏడాది నోటిఫికేషన్‌ వెలువడింది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. గామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఓపెన్‌ స్కూల్‌ను ప్రవేశపెట్టింది. ఓపెన్‌ స్కూల్‌ రెగ్యులర్‌ విద్య సర్టి ఫికెట్‌తో సమానం. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది.

– షేక్‌ షంషుద్దీన్‌, జిల్లా విద్యాశాఖాధికారి . వైఎస్సార్‌కడపజిల్లా

భవితకు ఆదరువు 1
1/3

భవితకు ఆదరువు

భవితకు ఆదరువు 2
2/3

భవితకు ఆదరువు

భవితకు ఆదరువు 3
3/3

భవితకు ఆదరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement