దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jun 24 2025 3:47 AM | Updated on Jun 24 2025 3:47 AM

దరఖాస

దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్‌: కడప రిమ్స్‌ వద్ద ఉన్న ప్రభుత్వ మైనార్టీ ఐటీఐలో రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ మైనారిటీ ఐటీఐ ప్రధానచార్యులు జ్ఞానకుమార్‌ తెలిపారు. ఇందులో ఎలక్ట్రీషన్‌, కంప్యూటర్‌(కోపా), డిజిటల్‌ మెకానిక్‌, వెల్డర్‌ ట్రేడ్‌లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పదో తరగతి పాస్‌, లేదా ఫెయిల్‌ అయిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు వారి 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, ఫొటో, మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్‌లో ఆన్‌లైన్‌లో iti.apgov.inలో రిజిస్టర్‌ చేసుకోవాలని తెలి పారు. దరఖాస్తు చేయుటకు జులై 15వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. వివరాలకు 9642602764, 8074577318 నెంబర్‌లను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ వివరించారు.

జవహర్‌ నవోదయ

విద్యాలయ ప్రవేశాలకు...

కడప ఎడ్యుకేషన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్‌ 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు జులై 27వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలు www.navodaya. gov.in అను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈఓ వివరించారు.

ఆసుపత్రి సీజ్‌

పోరుమామిళ్ల: పట్టణంలోని సాయిలీల ఆసుపత్రిని సోమవారం ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి సీజ్‌ చేయడంతో పాటు తాళం వేశారు. ఇటీవల ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ మల్లేష్‌, విచారణ అధికారి డాక్టర్‌ శివప్రసాదరెడ్డి సోమవారం తనిఖీ చేశారు. రిజిష్ట్రేషన్‌ గడువు ముగిసినా ఆసుపత్రి కొనసాగిస్తున్నారని గుర్తించి ఆసుపత్రిని మూసివేశారు. వారి వెంట పోరుమామిళ్ల మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీవిద్య, ఆరోగ్య విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్‌ వెంకటేష్‌ ఉన్నారు.

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలలో 163 మందికి చోటు

కడప ఎడ్యుకేషన్‌: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో ప్రవేశాలకు సంబంధించి వైఎస్సార్‌ జిల్లా నుంచి 163 మంది విద్యార్థులకు చోటు లభించింది. ఇందులో నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో 28 మందికి, ఆర్‌కేవ్యాలీ క్యాంపస్‌లో 69 మందికి, ఒంగోలు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో 46 మందికి, శ్రీకాకులం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో 20 మందికి సీట్లు లభించాయి.

చెమ్ముమియాపేట బాలికల

హైస్కూల్లో 5 మందికి...

కడప నగరంలోని చెమ్ముమియాపేట బాలికల హైస్కూల్‌కు చెందిన ఐదు మంది విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇందులో యువశ్రీ, మానస, బాను, గాయత్రి, లక్ష్మి సుస్మ ఉన్నారు. వీరికి పూర్వపు ప్రధానోపాధ్యాయురాలు మేరీ అభినందించారు.

ప్రశాంతంగా

మూడో రోజు కౌన్సెలింగ్‌

కడప ఎడ్యుకేషన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జరుగుతున్న మూడోరోజు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 32001వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను పరిశీలించుకున్నారు. మూడవ రోజు కౌన్సెలింగ్‌కు 200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ కౌన్సెలింగ్‌ కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి, ఛీప్‌ వెరిఫికేషన్‌ ఆపీసర్‌ దామోధర్‌, వెరిఫికేషన్‌ ఆఫీసర్లు అనిత, బాగ్యశ్రీ, రేణుకా, రాజేష్‌లతోపాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

నేటి కౌన్సెలింగ్‌కు...

నేడు నిర్వహించబోయే కౌన్సెలింగ్‌ కార్యక్రమా నికి జిల్లావ్యాప్తంగా 50001 నుంచి 68 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు హాజరుకావాలని కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం 
1
1/1

దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement