
● చెరువు మట్టి.. చెరబట్టి!
కూటమి ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది అనడానికి దేవుని కడప చెరువు నుంచి అక్రమంగా తరలిపోతున్న మట్టి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నిబంధనల ప్రకారం సమీప రైతులు ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిను పంటలో సత్తువ కోసం తోలుకుంటారు. కానీ కడప నగరంలో టీడీపీ నేతలు అక్రమంగా టిప్పర్ల ద్వారా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్లలలో మట్టిని తోలుకుని లక్షలాది రూపాయల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు చేరకుండా కొల్లగొట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. దేవుని కడప చెరువు నుంచి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా నిత్యం టిప్పర్లు తరలిపోతున్నాయి. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు భారీ వాహనాల రద్దీతో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ఎస్.కె.మహమ్మద్ రఫీ, సాక్షి ఫొటోగ్రాఫర్, కడప

● చెరువు మట్టి.. చెరబట్టి!

● చెరువు మట్టి.. చెరబట్టి!