అంగన్వాడీలకు పథకాలు వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీలకు పథకాలు వర్తింపజేయాలి

Jun 24 2025 3:47 AM | Updated on Jun 24 2025 3:47 AM

అంగన్వాడీలకు పథకాలు వర్తింపజేయాలి

అంగన్వాడీలకు పథకాలు వర్తింపజేయాలి

కడప సెవెన్‌రోడ్స్‌: రాష్ట్రంలోని అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులురెడ్డి, మనోహర్‌, అంగన్వాడీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, లక్ష్మిదేవి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వేతనాలు పెంచలేదన్నారు. రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ, అంగన్వాడీ వర్కర్లు రూ. 11,500, హెల్పర్లు, మినీ వర్కర్లు రూ. 7000 మాత్రమే గౌరవ వేతనం పొందుతున్నప్పటికీ వారికి సంక్షేమ పథకాలు అందించకపోవడం విచారకరమన్నారు. అంగన్వాడీలకు తల్లికి వందనం ఇవ్వాలని, రిటైర్డ్‌ అయిన వారికి పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వ ఉద్యోగులంటూ తిరస్కరించడం భావ్యం కాదన్నారు. వీటితోపాటు లేబర్‌ కోడ్స్‌ రద్దు చేసి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగలుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జీఓ జారీ చేయాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి ఆదిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, సీఐటీయూ నాయకులు చంద్రారెడ్డి, సత్యనారాయణ, ఐఎన్‌సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement