
నిరుద్యోగ భృతి ఇచ్చే వరకూ పోరాటం
రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చే వరకూ పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పోరాటం చేస్తేనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని, అందులో కూడా 50 శాతం మందికి నగదు జమ కాలేదన్నారు. విద్యాకానుక, వసతి దీవెన పథకాలు సక్రమంగా అమలు కాలేదన్నారు. విద్యార్థులకు యూనిఫారం ఇచ్చారే తప్పా షూ, బ్యాగ్, టై, బెల్టు వంటివి ఇవ్వలేదన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్రెడ్డి