
మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
చాపాడు : స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలను తీసుకుని వాటిని స్వ యం ఉపాధి కల్పనగా మార్చుకోవాలని.. దీని ద్వారా వ్యాపారం చేసుకుంటూ ఉత్పత్తిదారులుగా మారాలని డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో గురువారం యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో మెగా అగ్రీ డ్రైవ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియ న్ బ్యాంకు కడప రీజినల్ హెడ్ ఆఫీసర్ లక్ష్మి తులసి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి 27 సంఘాల మహిళలకు రూ.5కోట్ల బ్యాంకు రుణాలు, లక్పతి దీదీ పథకం ద్వారా 14 సంఘాల మహిళలకు రూ.70లక్షల మెగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ దేశంలోనే ఏపీలో డ్వాక్రా సంఘాలు ఎక్కువగా ఉన్నాయని, ఫలితాలు కూడా బాగున్నాయన్నారు. మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
లక్పతి దీదీ నుంచి కరోడ్పతి దీదీలుగా మారాలి
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, లక్ష్యం నిర్దేశించుకుని ఆర్థికాభివృద్ధి వైపు పయనించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ లక్ష్మి తులసి అన్నారు. గ్రూపు సంఘ సభ్యులతో పాటు మహిళలకు వేర్వేరుగా ఆర్థికాభివృద్ధి చెందేందుకు ఒక్కొక్కరి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ రుణాలను మంజూరు చేస్తామన్నారు. దీని ద్వారా మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని లక్పతి దీదీ నుంచి కరోడ్పతి దీదీలుగా మారాలన్నారు. జిల్లాలోని 48 బ్రాంచ్లలో 8500 సంఘాలు ఉండగా, చాపాడు మండలంలో బ్రాంచ్ పరిధిలో 10శాతం సంఘాలు ఉన్నాయన్నారు. జిల్లాలో చాపాడు మండలం మొదటి స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీధర్, బ్యాంకు మేనేజర్ కేవీ రమణ, సీసీలు, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి