
ఎన్టీఆర్ అందరికీ ఆదర్శం
కడప సెవెన్రోడ్స్: నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయం, స్ఫూర్తి దాయకమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ హాలులో జిల్లా యంత్రాంగం ఆద్వర్యంలో ఎన్టీ రామారావు 102 జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని ప్రతి ఏటా మే 28న ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడం, ఆ మహానుభావుని స్మరించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, వ్యవసాయ శాఖ జెడి నాగేశ్వరరావు, డిసిఎంహెచ్ హిమదేవి, అగ్నిమాపక శాఖ అధికారి ధర్మారావు, మెప్మా పిడి కిరణ్, స్టెప్ సీఈవో సాయి గ్రెస్ తదితర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్