
నేటి నుంచి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు
బ్రహ్మంగారిమఠం: భవిష్యత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల 9 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు మఠం పిట్పర్సన్ శంకర్బాలాజీ పర్యవేక్షణలో మఠం మేనేజర్ ఈశ్వరాచారి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, వంటివే కాకుండా హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు, వంటివి ఉంటాయి. 7న బ్రహ్మంగారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో బ్రహ్మంమాలధార భక్తులు విరుముడి తెస్తారు. 8న బ్రహ్మరధోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. 9న ప్రసాద వినియోగం ఉంటుంది.
ఈశ్వరీదేవి మఠంలో...
బ్రహ్మంగారి మనుమరాలు మాతా ఈశ్వరీదేవి మఠంలో ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక మఠాధిపతి వీరకుమారస్వామి ఆదేశాలమేరకు ఈఓ జగన్మోహన్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు బి.మఠంకు ఎండోమెంట్ మత్రి రాక
దేవదాయ ధర్మాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు బి.మఠంకు వస్తున్నట్లు మఠం పిట్పర్సన్ శంకర్బాలాజీ తెలిపారు. స్వామి దర్శనం అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారన్నారు.

నేటి నుంచి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు