
నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించనున్న పాలిసెట్ –2024 ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కడపలో 10, ప్రొద్దుటూరులో 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ 14 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8258 మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారు. ఇందులో కడపలోని 10 పరీక్షా కేంద్రాలలో 3943 మంది విద్యార్థులు, ప్రొద్దుటూరులోని 4 కేంద్రాలలో 4315 మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయనున్నారు. కాగా, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
● జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
● హాజరుకానున్న 8258 మంది విద్యార్థులు
● ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం