నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి

Apr 29 2025 7:11 AM | Updated on Apr 29 2025 7:11 AM

నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి

నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ఆరు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న తమకు ఆయుష్మాన్‌ భారత్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌/కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సందీప్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు గిఫ్టీ షీలా, ఉపాధ్యక్షులు హిమబిందు, ట్రెజరర్‌ తౌఫిక్‌అలీ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్‌ఓ పునరుద్ధరించాలన్నారు. క్లినిక్‌ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ–ఇంక్రిమెంట్‌, ట్రాన్స్‌ఫర్‌, ఎక్స్‌గ్రేషియా వంటివి అమలు చేయాలన్నారు.

కలెక్టరేట్‌ వద్ద ఏపీ ఎంసీఏ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement