
నేడు రైతులతో ముఖాముఖి
భువనగిరిటౌన్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారని కలెక్టర్ హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుభరోసా డబ్బులు నేటితో రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి ఖాతాల్లో జమకానున్నాయని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులతో సీఎం ముఖాముఖి అవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు రైతువేదికల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి రైతువేదికకు ఒక నోడల్ ఆఫీసర్ను నియమించినట్లు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,27,544 మంది రైతుల ఖాతాల్లో రూ.288,97,96,361 జమ అయినట్లు కలెక్టర్ తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.288.97 కోట్లు జమ
సాక్షి యాదాద్రి : వానాకాలం సీజన్కు గాను అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. జిల్లాలో 2,27,544మంది రైతులకు గాను సోమవారం వరకు 2,23,525 మంది ఖాతాల్లో రూ.288.97 కోట్లు జమ అయ్యాయి. మిగిలిన వారికి మంగళవారం జమకానున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వన మహోత్సవం, భూ భారతి, ఆయిల్పామ్ సాగు, సీజనల్ వ్యాధులపై కలెక్టర్ హనుమంతరావు ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధులను అరిక్టేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఆయిల్పామ్ సాగువల్ల ప్రయోజనాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలన్నారు.భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం పూర్తి చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి అనుబంధ క్షేత్రమైన శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు చేపట్టారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు కనుల పండువగా నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించి, ఆ తరువాత స్వామి, అమ్మవారికి కల్యాణం జరిపించారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
యాదగిరిగుట్ట: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులను సోమవారం యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల లెసెన్స్కు సంబంధించిన ధ్రు వీకరణ పత్రాలను పరిశీలించారు. స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, డ్రైవర్లు లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్తో పాటు ఖాకీ కలర్ చొక్కా ధరించాలని ట్రాఫిక్ సీఐ కృష్ణ సూచించారు. విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయాల్లో జాగ్రతలు తీసుకోవాలపి స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థిని ఇంటి నుంచి క్షేమంగా తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత డ్రైవర్లదేనన్నారు. కుటుంబసభ్యుల్లా భావించి విద్యార్థులతో మెదులుకోవాలన్నారు. తనిఖీల్లో ఎస్ఐలు దేవేందర్, రాజు, కానిస్టేబుల్స్ శ్రీధర్రెడ్డి, హనుమంతు, కాశీం, నరేష్, భిక్షపతి పాల్గొన్నారు.

నేడు రైతులతో ముఖాముఖి