
మూడు దఫాలు పత్తి గింజలు వేశాను
25 ఎకరాల్లో పత్తి సాగుచేశాం. రోహిణి కార్తెలో తొలకరి వానాలకు విత్తనాలు వేశాం. ఆ తరువాత వానలు పడకపోవడంతో మొలకెత్తలేదు. రోహిణి చివరి వారంలో రెండో దఫా విత్తనాలు పెట్టాం. అడపాదడపా కురిసిన వానలకు మొలకలు వచ్చాయి. మృగశిర కార్తె నుంచి చినుకు జాడలేకపోవడం, ఎండలు పెరగడంతో మొలకలు చనిపోయాయి. దీంతో మళ్లీ మూడో దఫా విత్తనాలు వేశాం. మొలకలు వచ్చినప్పటికీ వర్షాలు లేకపోవడంతో ఎదగడం లేదు. ఇప్పటి వరకు రూ.1.5 లక్షలు పెట్టుబడి వచ్చింది.
–చిన్నబత్తిని కస్పరాజు, సికింద్రనగర్, మోటకొండూరు మండలం