
కేసులను త్వరగా పరిష్కరించండి
సాక్షి, యాదాద్రి: పెండింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించాలిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, సబ్ప్లాన్, వివిధ శాఖల ద్వారా వెచ్చిస్తున్న నిధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. కార్పొరేషన్ రుణాలు, పథకాలు అర్హులకు అందేలా శ్రద్ధ తీసుకోవాలనిసూచించారు. పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్) తప్పనిసరిగా పాటించాలని, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించరాదన్నారు. ప్రతి నెలా చివరి శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి తహసీల్దార్, పోలీస్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్కు సూచించారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే డీవీఎంసీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అంతకుముందు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెంలో గల అంబేద్కర్ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులు పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబునాయక్, రేణుకుంట్ల ప్రవీణ్, కొనకాటి లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి , జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి శ్యాంసుందర్, డీఆర్డీఓ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలి
ఫ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
ఫ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం
చైర్మన్కు ఘన స్వాగతం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంంశ్యాదవ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్వాగతం పలికారు. సమావేశం అనంతరం కలెక్టర్ మెమెంటో అందజేసి శాలువాతో సత్కరించారు.