చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

May 30 2025 1:12 AM | Updated on May 30 2025 1:12 AM

చికిత

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మాడ్గులపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం తోపుచర్ల గ్రామానికి చెందిన బొప్పని సుధాకర్‌(42) హైదరాబాద్‌లో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం తోపుచర్ల నుంచి కుక్కడం గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. కుక్కడం గ్రామ శివారులో బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను స్థానికులు మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 19న హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

మాడ్గులపల్లి, నల్లగొండ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తితో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం సిలార్‌మియాగూడేనికి చెందిన రాయి మహేందర్‌ (21) ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తి చెందిన మహేందర్‌ గురువారం కొత్తగూడెం గ్రామ శివారులో గుంటూరు నుంచి వికారాబాద్‌ వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మహేందర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్‌ఐ బి. రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైల్లో నుంచి జారిపడి..

నల్లగొండ: నల్లగొండ–శ్రీరాంపురం రైల్వే స్టేషన్ల మధ్యన సుమారు 45ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి గురువారం రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్‌ఐ బి. రామకృష్ణ తెలిపారు. మృతుడు తెలుపు రంగు టీషర్టు, నీలం రంగు బనియన్‌, నలుపు రంగు నిక్కర్‌ ధరించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658595 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 1
1/1

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement