
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడడంతో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం బోరింగ్తండాకు చెందిన బానోత్ రమేష్(38) నూతనకల్ మండలం గుండ్ల సింగారం గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ వద్ద మూడేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బండారి శ్రీనివాస్ కర్ర వ్యాపారంతో పాటు బొగ్గు బట్టీ నడిపిస్తున్నాడు. ఇటీవల రామన్నగూడెం గ్రామానికి చెందిన భూరెడ్డి రాంరెడ్డి చెలకలో పలు రకాల చెట్లను బండారి శ్రీనివాస్ కొనుగోలు చేయగా.. వాటిని బొగ్గు బట్టీకి తీసుకెళ్లడానికి బుధవారం ఉదయం ఆరుగురు కూలీలతో పాటు రమేష్ ట్రాక్టర్లో అక్కడకు వెళ్లారు. కూలీలు చెట్లను కోస్తుండడంతో రమేష్ ట్రాక్టర్ను పక్కకు పెడుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి దాదాపు 100 మీటర్ల దూరంలో గల బొర్రాజ మల్లయ్యకు చెందిన వ్యవసాయ బావిలో పడిపోయింది. బావి తోతుగా, నీళ్లు ఎక్కువగా ఉండటంతో ట్రాక్టర్తో పాటు రమేష్ పూర్తిగా బావిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు మోటార్ల సహాయంతో బావిలోని నీటిని బయటకు తొలగించి రమేష్ మృతదేహాన్ని, ట్రాక్టర్ను బయటకు తీశారు. మృతుడికి ఇద్దరు భార్య, కుమారులు ఉన్నారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జానకిరాములు తెలిపారు. పోస్టుమార్టం మృతదేహాన్ని నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం రోజునే..
బానోత్ రమేష్ ఆత్మకూర్(ఎస్) మండలం ఇస్తాలపురం పాఠశాలలో 2003లో పదో తరగతి పూర్తి చేయగా.. మిత్రులందరూ కలిసి బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకోవాలని తొందరగా పని ముగించుకొస్తానని ఇంటి వద్ద చెప్పి వెళ్లిన రమేష్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులతో పాటు పదో తరగతి మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.