
బాలుడిని అకారణంగా కొట్టిన కానిస్టేబుల్
ఆత్మకూరు(ఎం): బాలుడిని పోలీస్ కానిస్టేబుల్ అకారణంగా కొట్టిన ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన మజ్జిగ ప్రవీణ్ 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం తమ వ్యవసాయ బావి వద్ద గొర్రెలను మేపుతున్న తన తల్లి విజయకు భోజనం తీసుకుని వెళ్లాడు. వారి భూమి పక్కనే 18 ఎకరాలను ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న లింగంనాయక్ కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. తల్లికి భోజనం తీసుకెళ్లిన ప్రవీణ్కు దాహం వేయడంతో లింగంనాయక్కు భూమిలోని బోరు మోటారు ఆన్ చేసి బాటిల్లో నీళ్లు పట్టుకున్నాడు. అక్కడే మేత మేస్తున్న గొర్రెలు కూడా నీళ్లు తాగడానికి లబీడు పొలంలోకి వచ్చాయి. ఇది గమనించిన లింగంనాయక్ ఆగ్రహంతో ప్రవీణ్ను కర్రతో చితకబాదాడు. ప్రవీణ్ తల్లి విజయ అడ్డురాగా ఆమైపె కూడా దాడి చేశాడు. దీంతో వారు కానిస్టేబుల్ లింగంనాయక్పై అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు లింగంనాయక్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ తండ్రి కనకయ్య, తల్లి విజయ ఆరోపిస్తున్నారు. గాయపడిన ప్రవీణ్ను బుధవారం మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోతగాని మల్లేశంగౌడ్ పరామర్శించారు. కానిస్టేబుల్ లింగంనాయక్పై చర్యలు తీసుకోవాలని కుర్మ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంమై ఎస్ఐ ఎస్. కృష్ణయ్యను వివరణ కోరగా.. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు