సంక్షేమ పాలనలో కేసీఆర్‌ను మించినోడు లేడు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పాలనలో కేసీఆర్‌ను మించినోడు లేడు

May 29 2025 10:06 AM | Updated on May 29 2025 10:06 AM

సంక్షేమ పాలనలో కేసీఆర్‌ను మించినోడు లేడు

సంక్షేమ పాలనలో కేసీఆర్‌ను మించినోడు లేడు

సూర్యాపేటటౌన్‌: ప్రజా సంక్షేమ పాలనలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను మించినోడు లేడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోటాయన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేసి మాట్లాడారు. కేసీఆర్‌ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే మరెక్కడా లేవని అన్నారు. హామీ ఇవ్వని పథకాలును కూడా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ కేసీఆర్‌ పథకాలే తప్ప కొత్తగా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను అందరికీ చేరువ చేసింది కేసీఆరేనన్నారు. రైతు భరోసా కాదు.. నేడు వ్యవసాయానికే భరోసా లేకుండాపోయిందన్నారు. కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.

సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement