చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

May 26 2025 1:30 AM | Updated on May 26 2025 1:55 AM

చికిత

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన సంగపాక నరేష్‌(30) ఇటీవల బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా.. భువనగిరి సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కారు ఢీకొని..

భువనగిరి: హైదరాబాద్‌కు చెందిన సంగపాక నవీన్‌(31) ఈ నెల 15న భువనగిరిలోని తన స్నేహితుడి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు బైక్‌పై వచ్చాడు. వేడుకల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. భువనగిరి మండలం అనంతారం గ్రామ పరిధిలో గల ప్లైఓవర్‌పై కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను స్థానికులు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి బంధువు బట్టు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్‌ సీఐ చంద్రబాబు తెలిపారు.

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు..

చౌటుప్పల్‌: ప్రమాదవ శాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు చెరుకు సత్తయ్య(54) రోజువారి మాదిరిగానే ఆదివారం ఉదయం సైతం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా మోకు జారడంతో జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పొలాల వద్ద ఉన్న వ్యక్తులు చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి సత్తయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు మల్లేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

పిడుగుపాటుతో

ఏడు మేకపోతులు మృతి

మేళ్లచెరువు: మేళ్లచెరువు మండలంలోని కందిబండ గ్రామ శివారులో ఆదివారం పిడుగుపడి ఏడు మేకపోతులు మృతిచెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన సుంకరబోయిన చినసైదులు ఆదివారం తన గొర్రెలతో పాటు వేరే వారికి చెందిన మేకపోతులను మేపుకుంటూ కందిబండ గ్రామ శివారులోకి వెళ్లాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో వర్షం రావడంతో మేకపోతులు స్థానిక పొలాల్లోని తాటిచెట్ల కిందకు వెళ్లాయి. ఈ సమయంలో ఓ తాటిచెట్టుపై పిడుగుపడడంతో దాని కింద ఉన్న ఏడు మేకపోతులు మృతిచెందాయి. హనుమంతుకు చెందిన 2 మేకపోతులు, పోశం అచ్చిరెడ్డికి చెందిన ఒకటి, సుంకరబోయిన చినసైదులుకు చెందిన 4 మేకపోతులు మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ.2లక్షలకు పైగా ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

చికిత్స పొందుతూ  వ్యక్తి మృతి1
1/1

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement