
రైతుల సంక్షేమాభివృద్ధికే భూభారతి
తుర్కపల్లి: రైతుల సంక్షేమాభివృద్ధి కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండల పరిధిలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భూభారతి చట్టం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. భూవివాదాల సమస్యల పరిష్కరానికి భూభారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గంధమల్ల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రికా ర్డుల్లో తప్పుల సవరణకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. కొత్త చట్టం పై రైతులకు అవగాహన కల్పించేందుకు పది రోజులగా సదస్సులు ఏర్పాటు చేసి రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూదార్ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ ఝన్సీలక్ష్మి బాయి, ఏసీపీ రమేష్ కుమార్, డి ప్యూటీ తహసీల్దార్ కల్పన, దనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం తుర్కపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణ పనులకు ఎంపీ కిరణ్ కుమార్తో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లెపహాడ్ స్టేజీ నుంచి బాబునాయక్తండా మీదుగా పర్రెబాయితండా వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య