
వచ్చే నెలలో షార్ట్ ఫిలిం పోటీలు
పాలకొల్లు సెంట్రల్: తెలుగు సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ భవనంలో మాట్లాడుతూ.. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిషత్కు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నారన్నారు. సంఘ పరిషత్ సభ్యులుగా కెఎస్పిఎన్ వర్మ, కె.రాంప్రసాద్, చేగొండి సత్యనారాయణమూర్తి, రాజా వన్నెంరెడ్డి, గుడాల హరిబాబు, బోణం వెంకట నర్సయ్య, విన్నకోట వెంకటరమణ, యిమ్మిడి రాజేష్ను నియమించినట్లు తెలిపారు. పోటీలు ఆగస్టు నెలాఖరులో నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 10 లోపు అప్లికేషన్స్ పంపించాలన్నారు. ఫిలిం 15 నిమిషాలు మించి ఉండరాదని అన్నారు. పోటీలకు దర్శకులు వీర శంకర్, రేలంగి నరసింహరావు, రాజా వన్నెంరెడ్డి, ఏఎన్ ఆదిత్య, రచయిత రాజేంద్రకుమార్లు జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.