
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గుబ్బల మంగమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి, సర్పంచ్ కోర్సా గంగరాజు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తి ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా పేపర్ బ్యాగ్లను తెచ్చుకోవాలని ఆలయ కమిటీ వారు కోరారు.