
ఇబ్బందులు పెరిగాయి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నుంచి రేషన్ సరుకులు ఇంటి వద్దనే తీసుకుంటున్నాం. అయితే వచ్చేనెల నుంచి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి రానుంది. ఇంట్లోని మగవారు పనిమానుకుని రేషన్ సరుకుల కోసం షాపులకు వెళ్లాల్సిందే. కూటమి ప్రభుత్వంలో పథకాలు మెరుగుపడతాయని అనుకుంటే ఇబ్బందులు పెరుగుతున్నాయి.
– కోరం లలిత, గంగడుపాలెం, యలమంచిలి మండలం
మా పొట్టకొట్టారు
ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం రూ.10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి నాలాంటి నిరుద్యోగుల పొట్టకొట్టారు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా తొలగించేశారు. ఎన్నికల వాగ్దానాన్ని ప్రభుత్వం అమలుచేయాలి.
– రాంబాలపు పరమేష్, గ్రామ వలంటీర్, అత్తిలి
ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి
గత నాలుగేళ్లుగా మొబైల్ వాహనంపై ప్రజలకు ఎంతో కష్టపడి ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందజేస్తున్నాం. దానిమీద బతికే వాళ్లం ఇప్పుడు హఠాత్తుగా మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాలు ఎలా బతకాలి. ఎండీయూ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ప్రభుత్వం వెంటనే చూపాలి.
– యామల ఆంజనేయులు, ఎండీయూ ఆపరేటర్, శృంగవక్షం
●

ఇబ్బందులు పెరిగాయి

ఇబ్బందులు పెరిగాయి