
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ తరఫున గురువారం విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావు, దూలం ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, రాష్ట్రంలో ఏకై క పెద్ద పరిశ్రమలో వేలాది మంది కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టడం దారుణమన్నారు. పరిశ్రమకు నిధులు కేటాయించాలని, తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై ఎటువంటి మాటలు మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు. చల్లా చంద్రరావు, బర్ల బాలాజీ, బి.శివ తదితరులు పాల్గొన్నారు.