
జై జవాన్.. జై భారత్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన ఎం.మురళీనాయక్, సైనికులకు ఏలూరు దత్తాశ్రమం, అశోక్నగర్ నమస్తే పార్కు వద్ద బంజారా భజరంగీ భేరి సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాలు, కొవ్వొత్తులతో శనివారం నివాళులర్పించారు. సంఘ జిల్లా నాయ కుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ యుద్ధభూమిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారన్నారు. భూక్యా నాగరాజు నాయక్ మాట్లాడుతూ భారత సైన్యంలో ఆత్మస్థైర్యం నింపడానికి దేశ ప్రజలంతా ఏకమై అండగా నిలవాలని కోరారు. జరభల వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మురళీనాయక్ వంటి సైనికుల ప్రాణాలకు విలువ కట్టలేమన్నారు. స్థానికులు, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు.