
మంచిలి వద్ద ఇసుక లారీ బీభ్సతం
అత్తిలి: మంచిలి గ్రామంలో ఓ ఇసుక లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మోటార్సైక్లిస్టు తీవ్రంగా గాయపడగా, రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. వివరాల ప్రకారం.. అత్తిలి మండలం కంచుమర్రు గ్రామానికి చెందిన కోరుకొల్లు కుమార్జోషిబాబు మంచిలి గ్రామంలో తాగునీటిని తీసుకువచ్చేందుకు యాక్టివా బండిపై వస్తున్నాడు. మంచిలి వంతెన వద్దకు వచ్చే సరికి భీమవరం నుంచి పెండ్యాల వైపు వెళుతున్న ఇసుక లారీ అదుపు తప్పి యాక్టివా బండిని వెనుకనుంచి ఢీకొట్టి, కొద్దిదూరం వెళ్లి రోడ్డుమార్జిన్లో ఉన్న రెండు విద్యుత్ స్థంభాలపైకి దూసుకెళ్లి పంటబోదెలోకి దిగబడింది. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్వైర్లు ఒకటికొకటి తాకడంతో ట్రిప్అయి విద్యుత్ సరఫరా నిలిచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్ అధికారులు వచ్చి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. గాయపడిన మోటార్సైక్లిస్టు కోరుకొల్లు కుమార్జోషిబాబును అత్తిలి ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు తన కారులో తణుకు ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
వ్యక్తికి గాయాలు..
ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు

మంచిలి వద్ద ఇసుక లారీ బీభ్సతం