ఆలస్యంగా ఇచ్చారు | - | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా ఇచ్చారు

May 6 2025 1:08 AM | Updated on May 6 2025 1:08 AM

ఆలస్య

ఆలస్యంగా ఇచ్చారు

మూడు ఎకరాలు కౌలు సాగు చేశాను. పంట కోసి ధాన్యం ఆరబెట్టుకున్నా సకాలంలో సంచులు ఇవ్వలేదు. సంచులు వచ్చాక పట్టుబడి చేశాం. మిల్లుకు తరలిద్దామనుకునే లోపు అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఇబ్బంది పడ్డాం.

– సి.సుందరరావు, కౌలురైతు, ఇలపర్రు

సంచులు లేకే సమస్య

మూడు ఎకరాల్లో కౌలు సాగు చేశాను. వారం క్రితమే కోసి ధాన్యం ఆరబెట్టుకున్నాను. సంచుల కోసం సచివాలయానికి వెళితే లేవన్నారు. సంచులుంటే ఈపాటికే ధాన్యాన్ని మిల్లుకు తరలించుకునే వాణ్ణి. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో మరలా ఆరబెట్టాల్సి వస్తోంది.

– డి. శ్రీను, కౌలు రైతు, ఆలమూరు

వర్షానికి తడిసిపోయింది

వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని మిల్లులకు తోలడానికి సంచుల కోసం ఎదురు చూస్తున్నాను. సంచులు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయంటూ అధికారులు కాలయాపన చేశారు. వర్షానికి ధాన్యం పంట తడిసిపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.

– కుడిపూడి నాగ సత్యనారాయణ, రైతు, ఇరగవరం

అవస్థలు పడుతున్నాం

సుమారు 90 బస్తాల వరకూ ధాన్యం పండింది. అడిగిన వెంటనే అధికారులు గోనె సంచులు ఇచ్చి ఉంటే బాగుండేది. నాలుగు రోజులు గడిచినా గోనె సంచులు ఇవ్వలేదు. దీంతో ధాన్యం పంటను వర్షాల నుంచి కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

– ఆలం సత్యనారాయణ, రైతు, తణుకు

ఆలస్యంగా ఇచ్చారు  
1
1/3

ఆలస్యంగా ఇచ్చారు

ఆలస్యంగా ఇచ్చారు  
2
2/3

ఆలస్యంగా ఇచ్చారు

ఆలస్యంగా ఇచ్చారు  
3
3/3

ఆలస్యంగా ఇచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement