అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం

May 4 2025 8:06 AM | Updated on May 4 2025 8:06 AM

అమరావ

అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం

నరసాపురం రూరల్‌: మండలంలోని సీతారామపురంలో 216 జాతీయ రహదారిపై శనివా రం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అమరావతిలో ప్రధాని సభకు వెళ్లి వస్తున్న రాజోలు డిపో బస్సు బ్రేక్‌ డౌన్‌ కావడంతో సంఘటనా స్థలంలో నిలిపివేశారు. అదే సభకు వెళ్లి తిరిగి వస్తున్న రాజోలు డిపో మరో బస్సు ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌, సిబ్బందికి గాయాలు కాగా 108లో నరసాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీల్లో నియామకాలు

భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ కేంద్ర కమిటీ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వాణిజ్య విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన ఉనికిలి శ్రీను, రాష్ట్ర ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ వింగ్‌ సెక్రటరీగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన చామన సూర్యచంద్రరావు నియమితులయ్యారు.

వేసవి సెలవులను నిరోధించేలా ప్రొసీడింగ్స్‌

భీమవరం: రెమిడియల్‌ తరగతుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ ఉపాధ్యాయుల వేసవి సెలవులను నిరోధించడమేనని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన 18.86 శాతం మంది పిల్లల కోసం సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఫెయిలైన పిల్లల కోసం ఉపాధ్యాయులను మండు వేసవిలో వేధించకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించుకుని, టీచర్లు వేసవి సెలవులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గోపిమూర్తి కోరారు.

దళిత క్రైస్తవుల ర్యాలీ

భీమవరం: ఎస్సీలు చర్చిలకు వెళితే ఎస్సీ హో దాను కోల్పోతారని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దళిత క్రైస్తవుల ఆధ్వర్యంలో స్థాని క అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద శనివారం రాత్రి క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కమిటీ కన్వీనర్‌ కోనా జోసెఫ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చని, హైకో ర్టు తీర్పును పునః పరిశీలించాలని కోరారు. గంటా సుందర్‌కుమార్‌, ఈది రవికుమార్‌, గాతల సందీప్‌, కమలాకర్‌, ఈది రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

12న అప్రెంటీస్‌ మేళా

ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12న ప్రధానమంత్రి అప్రెంటీస్‌ మేళా నిర్వహించన్నుట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాసరాజు శనివారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2021 నుంచి 2024 మధ్య వివిధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్సులతో హాజరుకావాలని సూచించారు.

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

ఏలూరు (టూటౌన్‌): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20 నుంచి సమ్మె లోకి వెళుతున్నట్టు ది జోనల్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎ. అప్పరాజు తెలిపారు. శనివారం సమ్మె నోటీసును ఏలూరు అడిషనల్‌ కమిషనర్‌ చంద్రయ్యకు అందజేశారు. ఏలూరు కార్పొరేషన్‌లో ప నిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, ఎన్‌ఎంఆర్‌ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, సరెండర్‌ లీవ్‌ బకాయిలు, డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని సిబ్బందికి కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని కోరారు.

అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం 1
1/1

అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement