
సంచుల కోసం రైతుల ధర్నా
కుళ్లిపోతున్నా పట్టించుకోరా?
ఏలూరు సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలోని శవ పరీక్ష కేంద్రం (మార్చురీ)లో ఫ్రీజర్ బాక్సులు పనిచేయక మృతదేహాలు పాడవుతున్నాయి. IIలో u
పెనుమంట్ర: ధాన్యం మాసూళ్లు చేసి రోజులు గడుస్తున్నా రైతు సేవా కేంద్రాల్లో గోనె సంచులు సరఫరా చేయడం లేదని, మిల్లుల వద్ద తూకా ల్లో మోసాలను అరికట్టాలంటూ శనివారం జుత్తిగ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. వీరికి జిల్లా కౌలు రైతు సంఘం మద్దతు తెలిపింది. తహసీల్దార్, వ్యవసాయ అధికారి ఇక్కడకు వచ్చి ఆదివారం నాటికి జు త్తిగ గ్రామానికి 25 వేల సంచులు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు కూసంపూడి సుబ్బరాజు మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు, సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీఆర్ 126 రకం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, బయట అమ్ముకోవాలని చెబుతున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ సంచికి అదనంగా ధాన్యం తూకం వేయడం, తేమ శాతం, నూక శాతం పేరుతో రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని విమర్శించా రు. ధాన్యం తూకంలో తాము మోసపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి రైతులు తీసుకువచ్చారు. సంచికి అదనంగా 600 గ్రాముల తరుగు మిల్లర్లు మినహాయిస్తున్నారన్నారు.