సీహెచ్‌ఓల ధర్నాకు మద్దతు | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌ఓల ధర్నాకు మద్దతు

May 3 2025 8:35 AM | Updated on May 3 2025 8:35 AM

సీహెచ

సీహెచ్‌ఓల ధర్నాకు మద్దతు

భీమవరం(ప్రకాశంచౌక్‌): భీమవరం కలెక్టరేట్‌ వద్ద ఐదు రోజులుగా ధర్నా చేస్తున్న విలేజ్‌ క్లినిక్‌ల సీహెచ్‌ఓలకు ఎమ్మెల్సీ గోపిమూర్తి శుక్రవారం మద్దతు తెలిపారు. సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. అనంతరం సీహెచ్‌ఓలతో కలిసి జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

మావుళ్లమ్మ సన్నిధిలో కలెక్టర్‌

భీమవరం(ప్రకాశంచౌక్‌): భీమవరం మావుళ్లమ్మవారిని శుక్రవారం కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం అందించారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, ఆలయ సిబ్బంది నల్లం లోకనాథం తదితరులు ఉన్నారు.

రమేష్‌కు ‘అకడమిక్‌’ అవార్డు

పాలకోడేరు: తమ కళాశాల అకడమిక్‌ అడ్వైజర్‌, మెంటర్‌ పి.వెంకట రమేష్‌ అకడమిక్‌ అడ్వైజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నట్టు బైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొప్పర్తి సురేష్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏషియా టుడే మీడియా సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన విశ్వ విద్యా సమ్మేళనం– 2025లో కేంద్ర మంత్రి చేతులమీదుగా రమేష్‌ అవార్డు అందుకున్నారన్నారు. కళాశాల చైర్మన్‌ అడబాల శ్రీ వెంకటేశ్వరరావు, సెక్రటరీ, కరస్పాండెంట్‌ అడ్డాల శ్రీహరి, డీన్‌కురెళ్ల భాస్కరరావు, హెచ్‌ఓడీలు రమేష్‌ను అభినందించారు.

జిల్లా నుంచి 7,500 మంది తరలింపు

భీమవరం(ప్రకాశంచౌక్‌): అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు పశ్చిమగోదావరి జిల్లా నుంచి బయలుదేరి వెళ్లే బస్సులను కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి శుక్రవారం భీమవరం పాత బస్టాండ్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం సీఎం చంద్రబాబు ఆదేశాలతో 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు జిల్లా నుంచి బయలుదేరి వెళ్లారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నీట్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్య విద్యలో ప్రవేశానికి ఏటా ఆన్‌లైన్‌లో నిర్వహించే నీట్‌ (యూ జీ) పరీక్షను ఈ ఏడాది పెన్‌, పేపర్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారని, జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేశామని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రీయ విద్యాల యం (గోపన్న పాలెం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గోపన్నపాలెం), సుబ్బమ్మదేవి మున్సిపల్‌ ఉన్నత పాఠశాల (ఏలూరు), కస్తూరిబా మున్సిపల్‌ బాలికా ఉన్నత పాఠశాల (ఏలూరు), ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఏలూరు)లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నా రు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించరన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటించాలని డీఈఓ వెంకటలక్ష్మమ్మ, నీట్‌ కో–ఆర్డినేటర్‌ భూర్‌ సింగ్‌ మీనా తెలిపారు.

సీహెచ్‌ఓల ధర్నాకు మద్దతు  
1
1/1

సీహెచ్‌ఓల ధర్నాకు మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement