
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
ద్వారకాతిరుమల: పేరుపాలెం బీచ్లో స్నేహితులతో కలసి సరదాగా స్నానం చేస్తుండగా ద్వారకాతిరుమలకు చెందిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది యువకులు శుక్రవారం ఉదయం ఒక ఆటోలో పేరుపాలెం బీచ్కు వెళ్లారు. బీచ్లో స్నానం చేస్తుండగా ద్వారకాతిరుమలకు చెందిన లాలూ నాయక్(17), సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన మధు బీచ్ లోపలికంటూ వెళ్లారు. లాలూ నాయక్ గల్లంతు కాగా, మధు ప్రాణాలతో బయటపడ్డాడు. సహాయక సిబ్బంది నాయక్ కోసం గాలిస్తున్నారు. తొమ్మిది మంది యువకులు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు.
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
జంగారెడ్డిగూడెం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి పట్టపగలు తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టి.నరసాపురం మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఒంటెద్దు క్రాంతికుమార్రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.