దొంగ నోట్ల చెలామణి? | - | Sakshi
Sakshi News home page

దొంగ నోట్ల చెలామణి?

Mar 18 2025 10:05 PM | Updated on Mar 18 2025 10:02 PM

మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం

వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో రూ.500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు తెలిసింది. సోమవారం వేలేరుపాడు వైన్‌షాపు వద్దకు ఓ వృద్ధురాలు మద్యం కొనుగోలుకు 2,500 తీసుకెళ్లగా, వైన్‌ షాపు సిబ్బంది అవి నకిలీ నోట్లుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, సారపాక కేంద్రాలుగా ఈ దొంగనోట్ల వ్యాపారాన్ని వేలేరుపాడు మండలంలో కొంతమంది వ్యక్తులు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. శివకాశీపురానికి చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం భద్రాచలం ప్రాంతంలో ఓ పురుగుమందుల షాపులో గత కొన్నేళ్ళుగా గుమస్తాగా చేరాడు. దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపిన సదరు గుమస్తా వేలేరుపాడు మండలం రేపాకగొమ్ముకు చెందిన తన బావమరిదికి దొంగనోట్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిఘా వర్గాలు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగుచూస్తాయంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement