భీమవరం: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జిల్లా సమావేశం శుక్ర వారం ఉదయం 10 గంటలకు పెదఅమిరం గ్రామంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు బంధన పూర్ణచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ రూ పొందించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారని, జిల్లాలో ని అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.