వరద బాధితులకు ఆశ్రయం | - | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు ఆశ్రయం

Oct 31 2025 7:19 AM | Updated on Oct 31 2025 7:19 AM

వరద బాధితులకు ఆశ్రయం

వరద బాధితులకు ఆశ్రయం

3,000 మందికి పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఏర్పాట్లు

వరంగల్‌ అర్బన్‌: మహానగర వ్యాప్తంగా జలమయమైన కాలనీల్లోని 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. గురువారం వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో సహాయక చర్యలను వారు పరిశీలించారు. గోపాల్‌పూర్‌, అమరావతి నగర్‌ సమ్మయ్య నగర్‌, టీవీ టవర్‌ కాలనీ, శాంతినగర్‌, వాజ్‌పేయి కాలనీ, వరంగల్‌లోని హంటర్‌ రోడ్డు, పోతన రోడ్డు, శివనగర్‌, బీరన్నకుంట తదితర ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. ఈసందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. తుపాను దృష్ట్యా బల్దియా పరిధి హనుమకొండలో 4, వరంగల్‌ పరిధిలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీరు, ఆహారం, రక్షణ కోసం దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement