జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి | - | Sakshi
Sakshi News home page

జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి

Oct 23 2025 2:09 AM | Updated on Oct 23 2025 2:09 AM

జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి

జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి

జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి

సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం : సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీస్‌ జాగృతి కళాబృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. పోలీస్‌ జాగృతి కళాబృందం సభ్యులతో సీపీ తన కార్యాలయంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏఏ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను కళాబృందం ఇన్‌చార్జ్‌ ఏఎస్సై నాగమణిని సీపీ అడిగి తెలుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్‌ నేరాలు, రోడ్‌ సేఫ్టీ, మూఢనమ్మకాలు, షీ టీం, డయల్‌–100, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే రీతిలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో కథాంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. అదే విధంగా కేవలం కథాంశాలే కాకుండా మూడేళ్లుగా సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు జరిగిన నష్టాలపై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కళాబృందం కార్యాచరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఏసీపీ ఎస్‌.బీ 2జాన్‌ నర్సింహులుకు సీపీ సూచించారు. సీపీతో ముచ్చటించిన వారిలో హెడ్‌ కానిస్టేబుళ్లు విలియమ్‌, రత్నయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ పూల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement