మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

Oct 21 2025 4:52 PM | Updated on Oct 21 2025 4:52 PM

మీడియ

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి వేధింపులు మానుకోవాలి..

సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు సరికాదు

నెహ్రూసెంటర్‌: సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్‌ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి.

– గుగ్గిళ్ల పీరయ్యమాదిగ,

ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి

నెహ్రూసెంటర్‌: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.

– గుగులోత్‌ భీమానాయక్‌,

ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

తక్షణమే కేసులను

ఉపసంహరించుకోవాలి

ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం1
1/1

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement