
కుంటకట్ట వివాదంపై విచారణ
గీసుకొండ: రాంపురం శివారులోని కుంటకట్టకు అడ్డంగా కొందరు రాళ్లు వేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు గీసుకొండ సీఐ మహేందర్ బుధవారం విచారణ చేపట్టారు. ఆయనతోపాటు ఎస్సై కుమార్ కుంటకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. కట్టపై రాకపోకలకు ఆటంకపరిచిన వారిని స్టేషన్కు పిలిపించి మాట్లాడతానని సీఐ చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. కుంటకట్టను ధ్వంసం చేశారని ఇటీవల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితులు ఊరుకోకుండా కట్టకు అడ్డంగా రాళ్లు వేసి ఆటంకం కలిగిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. దీంతో సీఐ స్వయంగా కట్ట ప్రాంతాన్ని పరిశీలించారు.