
ప్రభుత్వంపై యుద్ధం చేయాలి
ఖానాపురం: మంత్రివర్గంలో గొల్ల, కురుమలకు స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని గొల్ల, కురుమల యూత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆబోతు రాజుయాదవ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తూరులో గొల్లకురుమల ఆత్మగౌరవ సభ వాల్పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల, కురుమలను రేవంత్రెడ్డి ప్రభుత్వం చులకనగా చూస్తోందని ఆరోపించారు. కుట్రపూరితంగానే గొల్లకురుమలకు అన్యాయం చేస్తున్నారన్నారు. గొల్లకురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దామాషా ప్రకారం కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే సభకు గొల్లకురుమలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు ఆబోతు అశోక్, కోరె సుధాకర్, భూస అశోక్, విక్రం, ప్రశాంత్, రవికుమార్, ఐలయ్య, వీరస్వామి, కోరె రాములు, నాంచారి కుమార్, తదితరులు పాల్గొన్నారు.