
మాకు దారి చూపండి
న్యూశాయంపేట : వ్యవసాయ పనులు చేసుకోవ డానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ.. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది రైతులు కలెక్టర్ సత్యశారదను వేడుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సిఈఓ రామ్రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు నీరజ, విశ్వప్రసాద్, జ్ఞానేశ్వర్, అనసూయ, పుష్పలత, తహసీల్దార్లు ఇక్భాల్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
కిటకిటలాడిన ప్రజావాణి..
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి ప్రజలతో కిటకిటలాడింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ప్రజావాణిలో రెవెన్యూశాఖకు సంబంధించి 53, గృహనిర్మాణశాఖ 14, మిగితా శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు మొత్తంగా 121 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్.. అధికారులను ఆదేశించారు. పరిష్కరించేందుకు వీలుకాని ఫిర్యాదులపై దరఖాస్తుదారులకు వివరంగా చెప్పాలన్నారు. పరిష్కరించిన వివరాలను దరఖాస్తుదారుడి మొబైల్కి సమాచారం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీఐ దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూడాలన్నారు.
ఇ– ఫైలింగ్ విధానాన్ని అమలు చేయాలి
జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఇ–ఫైలింగ్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ను అన్ని కార్యాలయాల్లో తప్పని సరిచేయాలన్నారు. వ్యవసాయ ఆరోగ్యశాఖ విద్యాశాఖ తదతర శాఖపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని, పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు.
డాక్టర్పై చర్య తీసుకోవాలి
ములుగులో ఎంబీబీఎస్ అని చెప్పుకుంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ నాకు ఓవర్ యాంటిబయోటిక్స్ ఇంజక్షన్ ఇచ్చి రెండు పోవడానికి కారకుడైన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని పీహెచ్సీ డాక్టర్ రవీందర్పై చర్యలు తీసుకోవాలి.
– గుర్రం శ్రీహరి, నర్సాపూర్, ములుగు జిల్లా
ఇల్లు ఇప్పించండి..
నాది పేద కుటుంబం. నేను దివ్యాంగురాలిని. ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వండి.
– హైమావతి,
శంభునిపేట, వరంగల్
నా కొడుకులు
బాగోగులు చూస్తలేరు
నా భార్య చనిపోయింది. నాకు పక్షవాతం వచ్చింది. నా ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి. నాకు ఉన్న ఆస్తిని కుమారులు పంపకాలు చేసుకున్నారు. నా బాగోగులు చూడడంలేదు. నాకు న్యాయం చేయండి.
– చేరాల సాంబయ్య(కరీమాబాద్)
ప్రజావాణిలో కలెక్టర్కు పలువురి వినతి
దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి
అధికారులకు కలెక్టర్ సత్యశారద సూచన
పెన్షనర్స్కు ఇబ్బంది కలిగించొద్దు
పార్లమెంట్కు ముందస్తు సమాచారం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో పెన్షనర్స్ నష్టం కలిగించే చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ఉపసంహరించుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సంఘం, వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
– రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్
ఉద్యోగుల సంఘం బాధ్యులు

మాకు దారి చూపండి

మాకు దారి చూపండి

మాకు దారి చూపండి

మాకు దారి చూపండి

మాకు దారి చూపండి