
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
వేలేరు: మండలంలోని పీచర ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తుడుం సుధాకర్ తన కుమారుడు సుశాంత్ను తాను పని చేస్తున్న పీచర పాఠశాలలోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. తొమ్మిదో తరగతి చదువుతున్న సుశాంత్ను గతంలో స్టేషన్ ఘన్పూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెరగాలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు సుధాకర్ తెలిపారు. ఉపాధ్యాయుడి కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంతో హెచ్ఎం శ్రీదేవి, తోటి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆయనను అభినందించారు.