కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు | - | Sakshi
Sakshi News home page

కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు

Jun 24 2025 3:19 AM | Updated on Jun 24 2025 3:19 AM

కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు

కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు

వేలేరు: మండలంలోని పీచర ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తుడుం సుధాకర్‌ తన కుమారుడు సుశాంత్‌ను తాను పని చేస్తున్న పీచర పాఠశాలలోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. తొమ్మిదో తరగతి చదువుతున్న సుశాంత్‌ను గతంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదివించగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెరగాలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు సుధాకర్‌ తెలిపారు. ఉపాధ్యాయుడి కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంతో హెచ్‌ఎం శ్రీదేవి, తోటి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆయనను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement